News January 25, 2025
పెద్దపల్లి: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన కలెక్టరేట్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ వేడుకల్లో నూతనంగా 4పథకాల అమలు కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టడంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ఆన్లైన్లో నమోదు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రేపు ఉదయం 9గంటలకు కలెక్టర్ కోయ శ్రీహర్షతో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని.. దీనికి జిల్లాలోని ప్రజలు హాజరవ్వాలని అధికారులు కోరారు.
Similar News
News February 14, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 14, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.31 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 14, 2025
మస్క్తో ఈ అంశాలపైనే చర్చించా: PM మోదీ

USలో పర్యటనలో ఉన్న PM మోదీ ఎలాన్ మస్క్తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్, వివేక్ రామస్వామితోనూ PM చర్చలు జరిపారు.
News February 14, 2025
MBNR: హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. గోపి గురించి మెడికల్ ఆఫీసర్ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లేబర్ రూమ్ను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్న తల్లి బిడ్డలను పరామర్శించారు.