News March 23, 2025
పెద్దపల్లి: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
Similar News
News October 22, 2025
భూపాలపల్లి, ములుగు జిల్లాల మద్యం షాపులకు రేపు ఆఖరు!

భూపాలపల్లి, ములుగు జిల్లాల మద్యం షాపులకు రేపు ఆఖరి రోజు. ఇప్పటి వరకు రెండు జిల్లాలకు 1,672 దరఖాస్తురాగా, చివరి రోజు పెరిగే అవకాశం ఉంది. 59 మద్యం షాపులకు ఒక్కో దరఖాస్తుదారుడు రూ.3 లక్షల చెల్లించి దరఖాస్తు చేసుకుంటున్నారు. అంతేకాక, రేపు టెండర్లకు చివరి రోజు కానుంది. దీంతో మద్యం దుకాణాలకు భారీగా వ్యాపారులు దరఖాస్తు చేసుకోనున్నారు. గతేడాది ప్రభుత్వానికి రూ.43.22 కోట్లు ఆదాయం వచ్చింది.
News October 22, 2025
నావూరు పెద్దవాగును పరిశీలించిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల

పొదలకూరు మండలం నావూరుపల్లి వద్దనున్న నావూరు పెద్దవాగును బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అవడంతో ఆమె వాగును పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News October 22, 2025
కుమార్తె పై అత్యాచారయత్నం.. ఐదేళ్ల జైలు: SP

బొబ్బిలిలోని ఓ కోలనీలో 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారయత్నానికి పాల్పడిన నరసింగరావు (42)కి ఐదేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను పోక్సో కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. జూలైలో నమోదైన కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన సీఐ సతీష్ కుమార్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.