News March 30, 2025
పెద్దపల్లి: గురుకులంలో ప్రవేశాలు.. రేపే లాస్ట్ డేట్

తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 6 నుంచి 9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, అనాథలు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. హాల్టికెట్లు ఏప్రిల్ 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, దరఖాస్తు గడువు మార్చి 31న ముగియనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News November 29, 2025
TODAY HEADLINES

➢ గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) రాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
➢ జనవరి 1న అందరం లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ
➢ 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: CM CBN
➢ అమరావతిలో 15 బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన
➢ దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
➢ TGలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➢ కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదు: కవిత
News November 29, 2025
మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.
News November 29, 2025
జగిత్యాల: ‘ఉద్యోగులకు టీఎన్జీవో అండగా ఉంటుంది’

రాష్ట్రంలోని ఉద్యోగులకు టీఎన్జీవో సంఘం అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మెట్పల్లి యూనిట్ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయడం, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అంశాలపై సంఘంలో చర్చించారు.


