News March 30, 2025

పెద్దపల్లి: గురుకులంలో ప్రవేశాలు.. రేపే లాస్ట్ డేట్

image

తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 6 నుంచి 9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, అనాథలు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లు ఏప్రిల్ 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, దరఖాస్తు గడువు మార్చి 31న ముగియనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Similar News

News November 10, 2025

ధర్మేంద్ర హెల్త్‌పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

image

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్‌కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.

News November 10, 2025

న్యూస్ రౌండప్

image

*రేపు HYD ఘట్కేసర్ NFC నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
*దేవాలయాల్లో తొక్కిసలాట నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
*శంషాబాద్ విమానాశ్రయంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. 2.70 లక్షల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

News November 10, 2025

వేములవాడ: రాజన్న కళ్యాణం.. అరకొర టికెట్లతో నిరాశలో భక్తులు

image

వేములవాడ రాజన్న నిత్యకళ్యాణం టికెట్ల విషయంలో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. గతంలో విశాల కళాభవనంలో భక్తులు నిత్యకళ్యాణం మొక్కులు చెల్లించేవారు. ఆలయ విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్న నిత్యఅన్నదాన సత్రం పైఅంతస్తులో ఈ క్రతువును జరిపిస్తున్నారు. గతంలో 150 జంటలకు టికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని 90కి తగ్గించేశారు. టికెట్లు తీసుకునే సమయంలో ఇక్కడ తోపులాట సైతం జరుగుతుందని పలువురు పేర్కొన్నారు.