News March 17, 2025
పెద్దపల్లి: గురుకుల ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని BC గురుకులాల జిల్లా కో-ఆర్డినేటర్ మణి దీప్తి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మహాత్మ జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని BC బాలికల, బాలుర పాఠశాలల్లో 2025-26 వార్షిక విద్య 6-9తరగతులకు www.mgtbcadmissions.orgలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 18, 2025
సిద్దిపేట: ‘కుటుంబమే విద్యార్థుల వికాసానికి పునాది’

కుటుంబంలోని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల ప్రభావం విద్యార్థులపై బలంగా ఉంటుందని ప్రముఖ మనో వికాస శాస్త్రవేత్త, విద్యా కౌన్సిలర్ డాక్టర్ సి. వీరేందర్ అన్నారు. సిద్దిపేటలో నిన్న జరిగిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉత్తమ విద్యార్థులను తయారు చేయడానికి కుటుంబం పునాది వంటిదని అన్నారు.
News March 18, 2025
అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.
News March 18, 2025
ఇటలీలో సిరిసిల్ల జిల్లా వ్యక్తి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి ఇటలీలో రోడ్డు ప్రమాదంలో 15 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన మహమ్మద్ రషీద్ (47) ఇటలీలో లారీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో వేరే వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం రెండు రోజుల్లో స్వగ్రామం రానుంది.