News January 27, 2025
పెద్దపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి పసుపు రంగు షర్టు ధరించాడని, వయస్సు 60 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఎవరైనా అదృశ్యమైతే సంప్రదించాలని పోలీసులు సూచించారు.
Similar News
News December 4, 2025
సంగారెడ్డి: సమస్యాత్మక ప్రాంతాలు.. కలెక్టర్ కీలక సూచనలు

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News December 4, 2025
ఏలూరు: GOOD NEWS నెలకు రూ.12,500 వేతనం

ఏలూరు జిల్లా వ్యాప్తంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు MEO కార్యాలయంలో డిసెంబర్ 5 తేదీలోపు దరఖాస్తు సమర్పించాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.12,500, ఎస్జీటీ పోస్ట్కు రూ.10 వేల వేతనం ఇవ్వబడుతుందన్నారు. ఏలూరులో 4, కలిదిండిలో 1, కైకలూరులో 1, నూజివీడులో 1 పోస్టు ఉందన్నారు.
News December 4, 2025
అమరావతిలో భూసమీకరణపై ప్రశ్నలు!

AP: రాజధాని అమరావతిలో భూసమీకరణపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో సేకరించిన 32వేల ఎకరాల్లో పనులు ఓ కొలిక్కి రాకముందే రెండో విడతలో 16వేల ఎకరాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మూడో విడత భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మరో ఎయిర్పోర్ట్ ఎందుకని అంటున్నారు. దీనిపై మీ COMMENT?


