News January 27, 2025
పెద్దపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి పసుపు రంగు షర్టు ధరించాడని, వయస్సు 60 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఎవరైనా అదృశ్యమైతే సంప్రదించాలని పోలీసులు సూచించారు.
Similar News
News February 14, 2025
BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి: ఖానాపూర్ MLA

నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. ఉట్నూర్లోని కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.
News February 14, 2025
అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

AP: రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం లేదా CMO నామినేట్ చేసిన వారిని ఎంపిక చేయాలని ఉత్తర్వులిచ్చింది. వివిధ రంగాల్లో నిపుణులు, ప్రజల్లో మమేకమైన వారిని నైపుణ్యం, అర్హతల ఆధారంగా ఏడాది కాలానికి నియమించనున్నట్లు పేర్కొంది. అమరావతికి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది.
News February 14, 2025
రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: జాయింట్ కలెక్టర్

పకడ్బందీగా రీ సర్వే జరిగేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం సంబేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.