News January 31, 2025
పెద్దపల్లి: చివరి ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీళ్లు: ఎమ్మెల్యే

డి 83 ఎస్ఆర్ ఎస్పి కాల్వ 22 ఆర్ నుంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్ పల్లి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఎస్ఆర్ఎస్పి కాలువను ఆయన పరిశీలించారు. మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు రూ.50 లక్షలు ఖర్చుపెట్టి పూడిక తీయించామని తెలిపారు.
Similar News
News December 7, 2025
NMMS పరీక్షకు 86 మంది గైర్హాజరు: DEO

జిల్లాలో 12 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన జాతీయ ఉపకార వేతన(NMMS) పరీక్షను ఆదివారం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో వెల్లడించారు. 2654 మంది విద్యార్థులు హాజరుకాగా, 2568 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 86 మంది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు.
News December 7, 2025
కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.
News December 7, 2025
పాడేరు: ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష

జిల్లా వ్యాప్తంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. పరీక్ష కోసం మొత్తం 727 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 678 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించామన్నారు.


