News March 21, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా!

వాతావరణంలో మార్పుల వల్ల పెద్దపల్లి జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు వేసవి నేపథ్యంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత పెరుగుతుంది. వ్యవసాయదారులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గడిచిన 24 గంటల్లో ముత్తారం మండల కేంద్రంలో 37.8℃ గరిష్ట ఉష్ణోగ్రతలు, జూలపల్లి 22.0℃అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Similar News
News November 14, 2025
NRPT: గర్భిణీలకు వరంగా 102 అమ్మబడి సేవలు

నారాయణపేట జిల్లాలో గర్భిణీలు, ప్రసూతి స్త్రీల కోసం 102 అమ్మ ఒడి వాహనాలు నిరంతరం సేవలు అందిస్తున్నాయని అధికారులు తెలిపారు. మక్తల్, మద్దూర్, నారాయణపేట, మరికల్, ధన్వాడ, కోస్గి మండలాలకు కలిపి మొత్తం 8 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సూపర్వైజర్ రాఘవేంద్ర ప్రజలు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. గర్భిణీలకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రజలు జీవీకే సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
News November 14, 2025
బాల్య వివాహాలపై సమాచారం ఉంటే 1098కి ఫిర్యాదు చేయాలి: కలెక్టర్

బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సేవలు అధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బాలల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం సర్వేవల్, పార్టిసిపెంట్, డెవలప్మెంట్, ప్రొటెక్షన్ హక్కులను కల్పించిదని అని తెలిపారు.
News November 14, 2025
CII Summit: రూ.7,14,780 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

విశాఖ సీఐఐ సమ్మిట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో వివిధ కంపెనీలతో మొత్తం 75 ఎంఓయూలు చేసుకుంది. నిన్న 35 ఒప్పందాల ద్వారా రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులు, ఈరోజు 40 కంపెనీలతో రూ. 3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయి. ఇవి కాకుండా మంత్రి నారా లోకేశ్ సహా వివిధ శాఖల మంత్రులు మరిన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు.


