News February 27, 2025

పెద్దపల్లి: జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు

image

పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజాంబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 6.73% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అందులో పురుషులు 1467, మహిళలు621, మొత్తం 2088 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 13.68% జరిగింది. అందులో మహిళలు 52, పురుషులు 100 మంది ఓటు వేశారు.

Similar News

News November 18, 2025

కామారెడ్డి: ‘డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలి’

image

డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సోమవారం వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25మంది రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులతో ఎమ్మెల్యే పాల్గొని, యువత ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించడంపై పరిశోధన చేయనున్నట్టు విద్యార్థులు చెప్పారు.

News November 18, 2025

కామారెడ్డి: ‘డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలి’

image

డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సోమవారం వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25మంది రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులతో ఎమ్మెల్యే పాల్గొని, యువత ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించడంపై పరిశోధన చేయనున్నట్టు విద్యార్థులు చెప్పారు.

News November 18, 2025

వరంగల్: అర్ధరాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లో పోలీస్ తనిఖీలు

image

నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్పర్జన్ రాజ్ సిబ్బందితో కలిసి వరంగల్, హన్మకొండ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు, వారి బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.