News February 27, 2025

పెద్దపల్లి: జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు

image

పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజాంబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 6.73% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అందులో పురుషులు 1467, మహిళలు621, మొత్తం 2088 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 13.68% జరిగింది. అందులో మహిళలు 52, పురుషులు 100 మంది ఓటు వేశారు.

Similar News

News November 13, 2025

ఢిల్లీ పేలుడు: 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ?

image

టెర్రరిస్టులు బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా పేలుడు పదార్థాలను దేశంలోకి తీసుకొచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 3,200KGs <<18254431>>అమ్మోనియం నైట్రేట్<<>> కన్‌సైన్మెంట్‌ రాగా, అందులో 2,900KGs స్వాధీనం చేసుకున్నారు. మరో 300KGs దొరకలేదు. అది ఎక్కడుందో తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) దేశవ్యాప్తంగా దాడులకు ఉమర్ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

News November 12, 2025

ఏలూరు: గ్రంథాలయ భవనాన్ని తనిఖీ చేసిన జేసీ

image

ఏలూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి, శిథిలావస్థలో ఉన్న భవన పరిస్థితిని పరిశీలించారు. గ్రంథాలయ నిర్వహణకు అనుకూలమైన వసతి అంశాన్ని త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, సేవలను విస్తృత పరిచేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 12, 2025

ఏలూరు: గ్రంథాలయ వారోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

image

ఏలూరులో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈనెల 14 నుంచి 20 వరకు జరుగు” 58 వ” జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పోస్టర్‌ను కలెక్టర్ వెట్రిసెల్వి కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించారు. గ్రంథాలయాల ద్వారా విద్యార్థులకు మరి ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రంధాలయ సంస్థ సిబ్బంది ఎల్.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.