News February 27, 2025
పెద్దపల్లి: జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు

పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజాంబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 6.73% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అందులో పురుషులు 1467, మహిళలు621, మొత్తం 2088 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 13.68% జరిగింది. అందులో మహిళలు 52, పురుషులు 100 మంది ఓటు వేశారు.
Similar News
News March 23, 2025
NLG: సన్నబియ్యం లబ్ధిదారులు ఎంతమందంటే..

ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే రేషన్ డీలర్లతో సమీక్షలు నిర్వహించి పంపిణీపై చర్చించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సుమారు 10,07,011 రేషన్ కార్డులు ఉండగా.. ఇందులో 29,82,694 యూనిట్లు ఉన్నాయి. వీరి కోసం ప్రతినెల 19 వేలకు పైగా మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తున్నారు.
News March 23, 2025
నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. MLG, వేములపల్లి, తిప్పర్తి, హాలియా, NDMNR, కనగల్, మునుగోడు, NKL ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు.
News March 23, 2025
భగ్గుమంటున్న వనపర్తి

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా విలియంకొండ 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దమందడి 37.7, పెబ్బేరు 37.6, గోపాల్ పేట 37.5, దగడ 37.5, మదనాపూర్ 37.5, కానాయిపల్లి 37.4, ఆత్మకూర్ 37.2, కేతపల్లి 37.2, పానగల్ 37.1, రేమద్దుల 36.9, ఘన్పూర్ 36.7, వెలుగొండ 36.6, వనపర్తి 36.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.