News March 18, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

image

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ముత్తారం 40.1℃ నమోదు కాగా మంథని 40.1, రామగిరి 40.0, అంతర్గం 40.0, కాల్వ శ్రీరాంపూర్ 39.8, రామగుండం 39.7, ఓదెల 39.7, పాలకుర్తి 39.6, కమాన్పూర్ 39.3, సుల్తానాబాద్ 38.4, ధర్మారం 38.3, పెద్దపల్లి 36.6, ఎలిగేడు 35.7, జూలపల్లి 35.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.

Similar News

News January 11, 2026

బీపీ నార్మల్ అవ్వాలంటే ఇలా చెయ్యాలి

image

మారిన జీవనశైలితో ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే చాలామంది బీపీతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ముందు నుంచే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఉప్పు ఎక్కువగా వాడకుండా మసాలాలు, హెర్బ్స్ వాడాలి. ఎత్తుకు తగిన బరువుండేలా చూసుకోవాలి. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. స్మోకింగ్ మానేయాలి. ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అల్లాన్ని ఎక్కువగా వంటల్లో తీసుకోవాలి.

News January 11, 2026

భోగి మంటలు వేస్తున్నారా?

image

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భోగి వేళ వేసే మంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య కీలక సూచనలు చేశారు. భోగి మంటల్లో టైర్లు, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ వస్తువులు, రంగులేసిన ఫర్నీచర్, నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువులు వేయరాదని కోరారు. వీటిని కాల్చినప్పుడు వచ్చే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ తదితర విష వాయువులతో ఆరోగ్యానికి ప్రమాదమని సూచించారు.

News January 11, 2026

కృష్ణా: ‘టీ’ పెడుతుండగా చీరకు నిప్పు అంటుకొని వృద్ధురాలి మృతి!

image

ప్రమాదవశాత్తూ చీరకు నిప్పు అంటుకొని ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామానికి చెందిన విమలకుమారి (80) ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. శనివారం ఆమె టీ తయారు చేసుకుంటుండగా స్టవ్ మంటలు చీరకు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను 108లో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.