News March 23, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. వాతావరణ ప్రభావంతో కొన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంథని 37.5℃ నమోదు కాగా రామగిరి 37.4, ముత్తారం 37.8, పాలకుర్తి 36.8, కమాన్పూర్ 36.7, ఓదెల 36.6, సుల్తానాబాద్ 36.2, కాల్వ శ్రీరాంపూర్ 36.1, రామగుండం 35.8, అంతర్గం 35.6, పెద్దపల్లి 34.8, ధర్మారం 34.6, ఎలిగేడు 34.4, జూలపల్లి 33.2℃ గా నమోదయ్యాయి.
Similar News
News March 29, 2025
సినిమాలు వద్దని నిరాశపరిచారు: జెనీలియా

వివాహం తర్వాత సినిమాల్లో తిరిగి నటిద్దామంటే తెలిసిన వాళ్లు ఎవరూ సహకరించలేదని సినీ నటి జెనీలియా అన్నారు. పదేళ్ల తర్వాత సినిమాలోకి వస్తే ఏమాత్రం వర్కౌట్ కాదు అని నిరాశపరిచారన్నారు. అయినా వారి మాటలు వినకుండా ధైర్యంతో మూవీల్లో తిరిగి నటించానని తెలిపారు. 2022లో జెనీలియా నటించిన ‘వేద్’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో జెనీలియా నటించారు.
News March 29, 2025
శ్రీవారి సేవలో శాసనమండలి ఛైర్మన్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, సిపాయి సుబ్రమణ్యంలతో కలిసి రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించి, ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
News March 29, 2025
JRG: స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి

జంగారెడ్డిగూడెం (M) కొంగువారిగూడెం కెకెఎం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వంశీ (25), వంశీ కృష్ణ(23) ఇద్దరు యువకులు శనివారం జలాశయం ప్రాంతానికి వెళ్లారు. కాలువలోకి స్నానానికి దిగిన వీరిద్దరూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.