News February 4, 2025

పెద్దపల్లి: జిల్లాలో ముగ్గురు తహశీల్దార్ల బదిలీ

image

పెద్దపల్లి జిల్లాలో శ్రీరాంపూర్ తహశీల్దార్ MD. వకీల్, ఓదెల తహశీల్దార్ యాకన్న, ధర్మారం తహశీల్దార్ అరీఫుద్దీన్ లను బదిలీ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో సూపరింటెండెంట్లు గా పనిచేస్తున్న పి.జగదీశ్వరరావును శ్రీరాంపూర్, జె.సునీతను ఓదెల తహశీల్దారుగా నియమించారు. శ్రీరాంపూర్ తహశీల్దార్ వకీల్‌ను ధర్మారం తహశీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Similar News

News December 16, 2025

ఉప సర్పంచ్‌గా మెదక్ ఎంపీ కారు డ్రైవర్

image

మెదక్ MP రఘునందన్ రావు కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాయి చరణ్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మొదటి వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత గ్రామంలోని వార్డు సభ్యుల సహకారంతో ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సాయి చరణ్‌ను అభినందించారు.

News December 16, 2025

IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

image

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

News December 16, 2025

విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

image

విశాఖలో మంత్రి లోకేశ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన తనకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సతీశ్వరరెడ్డి కోరారు. కోనసీమ, పోలవరంలో గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలనీ కోరారు.