News January 29, 2025

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సిద్దిపేట వాసులు మృతి

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాట్నపల్లి శివారు వద్ద గల రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిద్దిపేట నుంచి కాళేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు సిద్దిపేట వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

ఏఐ సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు: వరంగల్ మేయర్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రంలో క్షేత్ర స్థాయిలో సందర్శించి అక్కడే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు.

News November 18, 2025

ఏఐ సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు: వరంగల్ మేయర్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రంలో క్షేత్ర స్థాయిలో సందర్శించి అక్కడే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు.

News November 18, 2025

ములుగు: రైతుల ఖాతాల్లో రూ.1. 82 కోట్లు జమ

image

జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నేటి వరకు 7131.080 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ వెల్లడించారు. 17 శాతం తేమతో 3775.120 మెట్టు టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.1.82 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచామన్నారు.