News July 12, 2024

పెద్దపల్లి జిల్లాలో 12వ శతాబ్ధం నాటి అరుదైన విగ్రహం

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో అరుదైన విగ్రహాన్ని గుర్తించారు. పెద్దపల్లికి చెందిన చరిత్ర పరిశోధకుడు సతీశ్.. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన సమయంలో అరుదైన అష్ట మహిషులతో కూడిన విగ్రహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ విగ్రహం 12వ శతాబ్ధంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా భావిస్తున్నట్లు తెలిపారు.
SHARE

Similar News

News November 2, 2025

HZB: ‘లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధం’

image

హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య, సౌకర్యాలను పరిశీలించి వైద్యులతో చర్చించారు. ఆడపిల్లల పుట్టుకపై తల్లిదండ్రులు ఎలాంటి తారతమ్యాలు చూపరాదని ఆమె సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధితమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 2, 2025

కరీంనగర్ : ఈనెల 15న లోక్ అదాలత్

image

కరీంనగర్, హుజూరాబాద్ కోర్టుల పరిధిలో ఈనెల 15న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేష్ తెలిపారు. లోక్ అదాలత్‌లో చెక్ బౌన్స్, క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News November 2, 2025

తిమ్మాపూర్: 41 ఏండ్ల సర్వీస్.. స్కూల్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

image

తిమ్మాపూర్ మండలం పొలంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 41 ఏండ్ల 8 నెలల సుదీర్ఘ సేవలు అందించిన ఎస్ఏ (సోషల్) టి. రమేష్ కుమార్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి వంగల శ్రీనివాస్, రమేష్ కుమార్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.