News February 12, 2025

పెద్దపల్లి జిల్లాలో 140 ఎంపీటీసీ, 13 జడ్పీటీసీ స్థానాలు

image

పెద్దపల్లి జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 140 ఎంపీటీసీలు, 13 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 50,994 మంది, ఎలిగేడులోని అత్యల్పంగా 18,537 మంది ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పురుషులు 2,03,366, మహిళలు 2,09,927, ఇతరులు 13 మంది, మొత్తం 4,13,306 మంది ఓటర్లు నమోదయ్యారు. మొత్తం 755 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

Similar News

News November 19, 2025

భద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ. 65.93 లక్షలు

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం హుండీలు విప్పి లెక్కింపు చేశారు. ఈ లెక్కింపులో మొత్తం రూ. 65,93,481 ఆదాయం వచ్చింది. వీటితో పాటు 2483 యూఎస్ఏ డాలర్లు, 55 ఆస్ట్రేలియా డాలర్లు సహా ఇతర విదేశీ కరెన్సీలు లభించాయి. హుండీలో వచ్చిన మిశ్రమ బంగారం, వెండిని తిరిగి హుండీలో వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అధికారులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

News November 19, 2025

ఆసిఫాబాద్‌లో రేపు మినీ జాబ్ మేళా

image

ఈ నెల 20న పాత కలెక్టర్ కార్యాలయం జనకాపూర్‌లో ఉదయం 10.30 గంటలకు TASK TRAINING CENTRE ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 19, 2025

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో సింగరేణి సంస్థ కీలక ఒప్పందం

image

సింగరేణి సంస్థ పునరుద్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ అమ్మకంలో సహకారానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, డైరెక్టర్లు, ఎన్జీఈఎల్ ఉన్నతాధికారులు మౌర్య, బిమల్ గోపాల చారి పాల్గొన్నారు.