News March 22, 2025
పెద్దపల్లి జిల్లాలో 2,150 ఎకరాల్లో పంట నష్టం: ఏడీఏ

పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా మొత్తం పంట నష్టం వివరాలను ADA శ్రీనాథ్ తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 950 ఎకరాల్లో మొక్కజొన్న, 1200 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్టు తెలిపారు.
Similar News
News December 4, 2025
సింగపూర్ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

AP: గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
News December 4, 2025
సాహిత్య భేరిలో భద్రాచలం విద్యార్థినికి ప్రశంసలు

భద్రాచలం విద్యార్థిని మడివి గురుత్వ సమందా సింగ్ కథా విభాగంలో ‘పేన్ పండుం అడివి రహస్యం’ కథ ఆకట్టుకుని, నిర్వాహకుల, వీక్షకుల ప్రసంశలు అందుకుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా అంతర్జాలంలో ఏకధాటిగా 13 గంటల పాటు బాలసాహిత్య భేరి నిర్వహించింది. ఆదివాసీ వేషధారణలో పాల్గొని ప్రత్యేకంగా నిలిచారు. దాంతో గురువారం ఆమెను ఐటీడీఏ పీఓ రాహుల్ అభినందించారు.
News December 4, 2025
KMR: ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యం: DGP

ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యమని DGP శివధర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమన్నారు. శాంతియుత, పారదర్శక గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేశామన్నారు. NZB, KMR జిల్లా పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు.


