News March 15, 2025
పెద్దపల్లి: జిల్లా పంచాయతీ అధికారిని కలిసిన నూతన కార్యవర్గం

టీఎన్జీవో అనుబంధ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంటర్ ఫోరం పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం శనివారం పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని డిపివోను కోరగా సమస్యలు ఉన్నతాధికారులకు సిపారసు చేస్తానని డిపివో హామీ ఇచ్చారు. డిపివోను కలిసిన వారిలో టిఎన్జివో జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్, కార్యదర్శులు ఉన్నారు.
Similar News
News October 14, 2025
ఏమిటీ పరకామణి కేసు-రాజీ వ్యవహారం..?

తిరుమల <<17999947>>పరకామణి<<>>లో 2023లో ఉద్యోగి రవికుమార్ దొంగతనం చేయడంపై CID విచారణ జరగాలని స్థానిక జర్నలిస్టు శ్రీనివాసులు గతేడాది HCలో పిటిషన్ వేశారు. ఈ చోరీపై 2023 APRలో పోలీసులకు ఫిర్యాదు చేసిన TTD విజిలెన్స్ ఆఫీసర్ సతీష్, SEPలో లోక్ అదాలత్లో రవితో రాజీ చేసుకున్నారని తెలిపారు. దీంతో అదాలత్ నిర్ణయాన్ని సస్పెండ్ చేసిన జస్టిస్ రామకృష్ణ.. ఖజానా రికార్డులు, రాజీ ఉత్తర్వుల సీజ్కు CIDని ఆదేశించినా ఆ పని చేయలేదు.
News October 14, 2025
NLG: బాలాజీ నాయక్ పై ఫిర్యాదుల వెల్లువ

అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీనాయక్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 112 ఫిర్యాదులు అందాయి. గుడిపల్లి పోలీస్ స్టేషన్కు బాధితులు అప్పు పత్రాలు, ఖాళీ చెక్కులతో తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 185 మంది బాధితులు బాలాజీపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్యాంపును ఏఎస్పీ మౌనిక పర్యవేక్షించారు.
News October 14, 2025
HYD: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో మోసపోయిన తండ్రి, కూతుళ్లు..!

HYD LB నగర్కు చెందిన RTC ఉద్యోగి M.రామకృష్ణ(49), కూతురు మిథాలీ(23) ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో మోసపోయారు. AUG 26న వారి స్నేహితుడు పంపిన LF వర్క్ అనే అప్లికేషన్లో రామకృష్ణ పెట్టుబడి పెట్టాడు. ప్రారంభంలో కొంత రాబడి చూపించగా మొత్తం రూ.1,35,210 ఇన్వెస్ట్ చేశాడు. కూతురు ఇన్వెస్ట్ చేసిన రూ.86,220 తిరిగి డ్రా చేసుకోలేకపోయారు. మోసపోయామని తెలుసుకుని ఫిర్యాదు చేశారని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.