News September 13, 2024
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు బంద్

పెద్దపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యుడిపై రోగి బంధువుల దాడి ఘటనను నిరసిస్తూ సాధారణ, అత్యవసర వైద్యసేవలు నిలిపివేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ప్రతినిధులు ప్రకటించారు. వైద్యులపై దాడులు ఆపకుంటే పెద్దఎత్తున ఆందోళనలు తప్పవన్నారు. ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య బృందం నేడు జిల్లాలో పర్యటించనుంది.
Similar News
News December 8, 2025
కరీంనగర్: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ర్యాండమైజేషన్ పద్ధతిలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో ఈ ప్రక్రియను నిర్వహించారు. పోలింగ్ అధికారులను (పీవో) 1255 మందిని, ఇతర పోలింగ్ అధికారులను (ఓపివో) 1773 మందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు.
News December 7, 2025
కరీంనగర్ జిల్లా గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ జిల్లా జీపీవో అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉట్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయప్రసాద్, ఉపాధ్యక్షులుగా నూనె రమేష్, సాగర్, అనిల్, కోశాధికారి హరీష్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ గా నలువాల సాయికిషోర్, నీర్ల రేవంత్, జెట్టి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలుగా పెంటి మమత, ఉపాధ్యక్షురాలుగా చందన, వనితలు ఎన్నికయ్యారు. తహశీల్దార్ బండి రాజేశ్వరి నూతన కమిటీని అభినందించారు.
News December 7, 2025
కరీంనగర్: పల్లెపోరులో స్థాయికి మించిన వాగ్దానాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థాయికి మించిన హామీ పత్రాలను పంచుతున్నారు. స్థానిక పన్నులు, కేంద్ర నిధులకు పరిమితమైన పంచాయతీకి భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఇవి ఎలా నెరవేరుతాయోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యతపై అనుమానాలు ఉన్నా, గెలుపు కోసం అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.


