News February 23, 2025
పెద్దపల్లి: తండ్రిని చంపిన కొడుకు

HYDకుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్నతండ్రిని ఓ కొడుకు హత్యచేశాడు. PDPL(D) కాల్వశ్రీరాంపూర్(M) వెన్నంపల్లికి చెందిన అరెల్లి మొగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బులకోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్యచేశాడు.
Similar News
News February 23, 2025
‘భారత్ ఓడిపోతుంది’ అన్న ఐఐటీ బాబా ఎక్కడ?

పాక్ చేతిలో భారత్ ఓడిపోతుందని <<15548119>>జోస్యం చెప్పిన<<>> ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. Xలో #IITianBaba ట్రెండ్ అవుతోంది. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని నిన్న ఐఐటీ బాబా అనడంపై ఫైరవుతున్నారు. ‘ఇప్పుడు నీ జోస్యం ఏమైంది?’ అని నిలదీస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవడమేంటని మండిపడుతున్నారు.
News February 23, 2025
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞప్తి

దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్,మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
News February 23, 2025
ఇది అత్యంత దారుణం: YS జగన్

AP: గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి చివరకు నట్టేటా ముంచారని CM చంద్రబాబును YS జగన్ విమర్శించారు. ‘అభ్యర్థుల సమస్యలకు పరిష్కారం చూపిస్తానని పరీక్షకు 2 రోజులముందు విద్యాశాఖ మంత్రి మోసపూరిత ప్రకటన చేశారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినా APPSC ముందుకు వెళ్తోందని CM వాయిస్తో ఆడియో లీక్ చేయించి డ్రామా చేశారు. అయోమయం, అస్పష్టత మధ్యే పరీక్షలు నిర్వహించడం అత్యంత దారుణం’ అని <