News February 23, 2025
పెద్దపల్లి: తండ్రిని చంపిన కొడుకు

HYDకుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్నతండ్రిని ఓ కొడుకు హత్యచేశాడు. PDPL(D) కాల్వశ్రీరాంపూర్(M) వెన్నంపల్లికి చెందిన అరెల్లి మొగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బులకోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్యచేశాడు.
Similar News
News December 4, 2025
తిరుపతి SVUలో ఇంత దారుణమా..?

తిరుపతి SVU పరిధిలో 1991 నుంచి 2015 వరకు డిగ్రీ చదివిన వాళ్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్కో పేపర్కు రూ.2వేలు, 3పేపర్లకు మించితే రూ.4వేలు చొప్పున ఫీజు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు పరీక్షల షెడ్యూల్ ఇవ్వలేదు. డబ్బులు కట్టి సంవత్సరం దాటుతున్నా పరీక్షల తేదీ వెల్లడించకపోవడంతో SVUలో ఇంత దారుణమా? అని అందరూ విమర్శిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News December 4, 2025
ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ హనుమంతరావు

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం మోటకొండూరులో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులకు వచ్చిన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని, ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 4, 2025
HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT


