News February 23, 2025
పెద్దపల్లి: తండ్రిని చంపిన కొడుకు

HYDకుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్నతండ్రిని ఓ కొడుకు హత్యచేశాడు. PDPL(D) కాల్వశ్రీరాంపూర్(M) వెన్నంపల్లికి చెందిన అరెల్లి మొగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బులకోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్యచేశాడు.
Similar News
News November 26, 2025
ములకలచెరువు: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

అన్నమయ్య జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ నరసింహ వివరాల మేరకు.. కదిరి వైపు నుంచి వస్తున్న కారును ములకలచెరువు మండలం వేపూరికోట వద్ద ఓ లారీ ఢీకొట్టింది. కారులోని ఇద్దరు చనిపోయారు. మృతులు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్కు చెందిన వెంకటరమణ, రాజశేఖర్గా గుర్తించారు. లారీ మదనపల్లె వైపు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
News November 26, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత..!

నాగర్ కర్నూల్ జిల్లాలో గత రెండు రోజులుగా విపరీతంగా చలి తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కల్వకుర్తి మండలం తోటపల్లిలో అత్యల్పంగా 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి 15.3, యంగంపల్లి 15.4, బొల్లంపల్లి 15.6, కొండనాగుల 16.0, పెద్దముద్దునూరు 16.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. దీంతో ఉదయం వేళలో ప్రజలు చలి తీవ్రతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News November 26, 2025
3,058 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి NOV 29 వరకు ఛాన్స్ ఉంది. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. www.rrbcdg.gov.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


