News February 23, 2025

పెద్దపల్లి: తండ్రిని చంపిన కొడుకు

image

HYDకుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్నతండ్రిని ఓ కొడుకు హత్యచేశాడు. PDPL(D) కాల్వశ్రీరాంపూర్(M) వెన్నంపల్లికి చెందిన అరెల్లి మొగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బులకోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్యచేశాడు.

Similar News

News November 28, 2025

SKLM: కళ్ల ముందు తల్లి మృతి.. తల్లడిల్లిన కొడుకు హృదయం

image

కళ్ల ముందే తల్లి మృతి చెందడంతో కొడుకు హృదయం తల్లడిల్లిన ఘటన శుక్రవారం ఆమదాలవలస ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో చోటు చేసుకుంది. బూర్జ (M) కొల్లివలసకు చెందిన మణికంఠ తన తల్లి భానుమతితో కలిసి స్కూటీపై శ్రీకాకుళం వైపు వెళ్తున్నారు. ఆమదాలవలస ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో పాలకొండ వైపు కొబ్బరికాయల లోడుతో వచ్చిన లారీ ఢీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి.

News November 28, 2025

గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల వేట..!

image

పంచాయతీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు వేట ప్రారంభించాయి. వేములవాడ నియోజకవర్గంలోని 129 GPలకు, సిరిసిల్లలోని 5 మండలాల్లో 85, JGTL జిల్లాలో 3 మండలాల్లో 44 GPలు ఉన్నాయి. అన్ని పంచాయతీలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహించనుండడంతో నామినేషన్ల దాఖలుకు రెండు రోజుల గడువే మిగిలింది. రిజర్వేషన్ల వల్ల ఆశావహులకు అవకాశం దక్కకపోవడంతో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు.

News November 28, 2025

22 ఏళ్లకే సర్పంచ్.. ఊరిని మార్చేందుకు యువతి ముందడుగు!

image

డిగ్రీ, పీజీ పూర్తయ్యాక పట్టణాలకు వలసెళ్లకుండా ఊరిని బాగుచేయాలి అనుకునే యువతకు 22 ఏళ్ల సాక్షి రావత్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సర్పంచ్‌గా మారి గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని భావించిన సాక్షికి ఊరి ప్రజల తోడు లభించింది. ఉత్తరాఖండ్‌లోని కుయ్‌ గ్రామ ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా గెలిచారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి.. యువ శక్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.