News February 26, 2025

పెద్దపల్లి: తండ్రిని హత్య చేసిన కొడుకుకు యావజ్జీవం

image

తండ్రిని చంపిన కొడుకుకు కోర్టు యావజ్జీవం విధించింది. SI శ్రావణ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ వాసి నర్సయ్య కుటుంబం సుల్తానాబాద్ పరిధి పూసాల గ్రామంలో నివాసం ఉంటోంది. అతడి పెద్దకొడుకు రాజేశం(40) 20 ఏళ్ల క్రితం హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా 2023 DEC 8న క్షణికావేశంలో తండ్రిని చంపేశాడు. కోర్టు రాజేశానికి యావజ్జీవ శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది.

Similar News

News December 7, 2025

నిజామాబాద్: DCCలకు పరీక్ష

image

కొత్తగా ఎన్నికైన ఉమ్మడి NZB జిల్లా DCC అధ్యక్షులు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి జిల్లాలో NZB DCC అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి, KMR DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఆలేను నియమించారు. కొత్తగా నియమితులైన వారి పని తీరును ఆరు నెలల పాటు పరిశీలిస్తామని ఇప్పటికే CM ప్రకటించారు. GP ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని వారిలో టెన్షన్ పట్టుకుంది.

News December 7, 2025

వెంకటాపూర్: జడ్పీటీసీ నుంచి సర్పంచ్‌గా పోటీ

image

వెంకటాపూర్ మండలం నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్‌గా తాజా మాజీ జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్ బరిలో నిలిచారు. గతంలో నర్సాపూర్ సర్పంచ్‌గా పని చేసిన ఆమె, అనంతరం జడ్పీటీసీగా గెలుపొందారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తిరిగి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు రుద్రమదేవి తెలిపారు.

News December 7, 2025

KNR: తమ్మీ నమస్తే.. ఇంటికొచ్చి ఓటేసి వెళ్లు!

image

ఉమ్మడి KNRలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. అభర్థులు, ఆశావహులు గ్రామాల్లో తిరుగుతూ ‘బాబాయ్, చిన్నమ్మ.. నీ ఓటు నాకే వేయాలి’ అంటూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఓటు బ్యాంకింగ్ పెంచుకోవడానికి ఉద్యోగం, ఉపాధి నిమిత్తం పట్టణాల బాట పట్టిన వారికి సైతం అభ్యర్థులు కాల్ చేసి ‘అన్నా, తమ్మీ నమస్తే. ఈసారి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా. ఇంటికొచ్చి ఓటేసి వెళ్లు’ అంటూ కాల్ చేసి మరీ పిలుస్తున్నారట. మీకూ కాల్ వచ్చిందా?