News February 26, 2025
పెద్దపల్లి: తండ్రిని హత్య చేసిన కొడుకుకు యావజ్జీవం

తండ్రిని చంపిన కొడుకుకు కోర్టు యావజ్జీవం విధించింది. SI శ్రావణ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ వాసి నర్సయ్య కుటుంబం సుల్తానాబాద్ పరిధి పూసాల గ్రామంలో నివాసం ఉంటోంది. అతడి పెద్దకొడుకు రాజేశం(40) 20 ఏళ్ల క్రితం హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా 2023 DEC 8న క్షణికావేశంలో తండ్రిని చంపేశాడు. కోర్టు రాజేశానికి యావజ్జీవ శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది.
Similar News
News February 23, 2026
మొలతాడు గురించి మీకు ఈ కథ తెలుసా?

మొలతాడుధారణ వెనుక ఓ పురాణ కథ ఉంది. కృష్ణుడి వరంతో ఉదంక మహర్షికి అమృతం ఇవ్వడానికి ఇంద్రుడు చండాలుడి రూపంలో వచ్చాడు. అమృత భాండాన్ని తన నాభి దిగువన మొలతాడుకు కట్టుకుని తెచ్చాడు. నాభి కింద భాగం అపవిత్రమని భావించిన రుషి దానిని నిరాకరించాడు. ఈ ఘటన ద్వారా శరీరాన్ని ఊర్థ్వ, అథో భాగాలుగా విభజించే సూచీ రేఖగా మొలతాడు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది క్రమశిక్షణకు, పవిత్రతకు చిహ్నంగా మారింది.
News February 23, 2026
APPLY NOW: ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<
News February 23, 2026
సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కొట్టివేత

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన <<19208192>>ఏకసభ్య కమిషన్ను<<>> సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. పరిపాలనా పరమైన లోపాల గుర్తింపునకు ఆ కమిషన్ను ఏర్పాటు చేశారని CJI ధర్మాసనం అభిప్రాయపడింది. సిట్ దర్యాప్తును కమిషన్ ప్రభావితం చేయబోదని పేర్కొంది.


