News February 3, 2025
పెద్దపల్లి: తల్లి గొప్పతనం.. ఇద్దరికి నేత్రదానం..!

ఓదెల గ్రామానికి చెందిన బోడకుంట రాజమ్మ మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఫౌండేషన్ ప్రతినిధి డా.భీష్మాచారి, కొండ్ర వేణు నేత్రదానంపై అవగాహన కల్పించారు. LV ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ నరేందర్ సహకారంతో ఆమె నేత్రాలను సేకరించి HYD-I బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు లక్ష్మయ్య, సుగుణ, సదానందం, మల్లేశ్వరి, రమేశ్, రమ, మధులను ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు.
Similar News
News October 14, 2025
NGKL: బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు ఇబ్బందులు వద్దు: కలెక్టర్

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమంపై జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ తెలిపారు.
News October 14, 2025
గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు: ఎస్పీ

జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో మహిళలు, చిన్నారుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించాలన్నారు.
News October 14, 2025
MHBD జిల్లా వ్యాప్తంగా లిక్కర్ షాప్లకు 124 దరఖాస్తులు

మహబూబాబాద్ జిల్లాలో లిక్కర్ షాప్లకు మొత్తం 124 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. మంగళవారం 11 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని, ఈనెల 18తో గడువు ముగుస్తుందని సూచించారు. గతంలో కంటే ఇప్పుడు దరఖాస్తులు తగ్గుతున్నాయన్నారు.