News March 13, 2025
పెద్దపల్లి: దివ్యాంగులకు విజ్ఞప్తి అప్లై UDID కార్డు

ప్రతీ దివ్యాంగునికి యూనిక్ డిసెబిలిటీ ఐడి నంబర్ జారీ గురించి PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదరం క్యాంపులు సజావుగా జరుగడానికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. UDID కార్డులు ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తాయన్నారు. అధికారులు దివ్యాంగులకు అవగాహన కల్పించి మీసేవాలో బుక్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులు పరిశీలించి పోస్టులో కార్డులు పంపాలని ఆదేశించారు.
Similar News
News November 27, 2025
కామారెడ్డి జిల్లాలో తొలిరోజు 210 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీల్లో (1,520 వార్డులకు) ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచి స్థానాలకు 115 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 95 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రాలేదు.
News November 27, 2025
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రమును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.
News November 27, 2025
అనంతపురం జిల్లాలో దారుణం

అనంతపురం శారదానగర్లో గురువారం దారుణం చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ భార్య అమూల్య తన 3 ఏళ్ల కుమారుడు సహస్రను గొంతు కోసి, తాను ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఇరువురు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


