News March 13, 2025
పెద్దపల్లి: దివ్యాంగులకు విజ్ఞప్తి అప్లై UDID కార్డు

ప్రతీ దివ్యాంగునికి యూనిక్ డిసెబిలిటీ ఐడి నంబర్ జారీ గురించి PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. సదరం క్యాంపులు సజావుగా జరుగడానికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. UDID కార్డులు ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తాయన్నారు. అధికారులు దివ్యాంగులకు అవగాహన కల్పించి మీసేవాలో బుక్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులు పరిశీలించి పోస్టులో కార్డులు పంపాలని ఆదేశించారు.
Similar News
News September 14, 2025
పల్నాడు జిల్లా ఐదో ఎస్పీగా కృష్ణారావు నియామకం

పల్నాడు జిల్లా ఐదో ఎస్పీగా కృష్ణారావు నియమితులయ్యారు. 2014 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈయన గతంలో విశాఖపట్నం రూరల్ ఎస్పీగా, గ్రేహౌండ్స్ ఓఎస్డీగా, ఏసీబీలో ఎస్పీగా పనిచేశారు. అలాగే, పులివెందుల ఎస్పీగా, అన్నమయ్య జిల్లా ఎస్పీగా కూడా ఈయన సేవలు అందించారు. కాగా పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటికే నలుగురు ఎస్పీలు బదిలీ అయ్యారు.
News September 14, 2025
HYD: ఓటరుగా నమోదు చేసుకోండి: కమిషనర్ RVK

జూలై 1, 20025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈనెల 17వ తేదీన ఓటరు నమోదుకు అవకాశం ఉందని, ఈ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు అధికారిక వెబ్సైట్ ceotelangana.nic.in, ecinet.eci.gov.in, eci.gov.inలలో నమోదు చేసుకోవచ్చని సూచించారు.
News September 14, 2025
మినరల్ వాటర్ తాగిన వారికీ డయేరియా.. కారణం ఇదే!

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని డయేరియా కేసుల వ్యాప్తి నేపథ్యంలో పలు RO ప్లాంట్లను అధికారులు పరిశీలించారు. నీటిలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాను తొలగించే UV LAMP అనేక చోట్ల లేదని గుర్తించారు. దీని విలువ రూ. 25 వేల వరకు ఉంటుందట. దీంతో అంత ఖర్చు మనకెందుకు అన్నట్లు RO ప్లాంట్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నీటిలో బ్యాక్టీరియా ప్రబలి డయేరియా బారిన పడ్డట్లు ప్రజలు అంటున్నారు.