News February 11, 2025

పెద్దపల్లి: నేటి నుంచి భాగ్యనర్ ఎక్స్‌ప్రెస్

image

పెద్దపల్లి జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులు రద్దు కావాల్సిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 11 నుంచి 14 వరకు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్‌(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

image

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్‌లైన్ కంటెంట్ రూల్స్‌ను మస్క్ ప్లాట్‌ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.

News December 6, 2025

KMR: బరిలో ఉండేదేవరో.. జారుకునేది ఎవరో..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారంతో ముగియనుంది. పలు మండలాల్లో వార్డు, సర్పంచి స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. అసలు సిసలైన పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతోందన్నది శనివారం సాయంత్రానికి తేటతెల్లం కానుంది. బరిలో నిలిచేది ఎవరో, తప్పుకునేది ఎవరో తెలియాలంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే!

News December 6, 2025

నిర్మల్: తొలి విడతలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్స్ జరగనున్న ఆరు మండలాల్లో మొత్తం 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మామడ 5, ఖానాపూర్ 5, పెంబి 4, దస్తురాబాద్, లక్ష్మణచందా మండలాల్లో 1 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కడెంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.