News March 10, 2025

పెద్దపల్లి: నేడు ప్రజావాణి పునః ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం ఉదయం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తాత్కాలికంగా కొద్ది వారాల పాటు రద్దు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 10 సోమవారం తిరిగి పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. కావున జిల్లాలోని అర్జీదారులు వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News November 7, 2025

ఖమ్మం: వేతనాలివ్వాలని కార్యాలయానికి తాళం

image

మూడు నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిషన్ భగీరథ కార్మికులు గురువారం నిరసనకు దిగారు. విధులకు వెళ్లలేని స్థితిలో ఉన్నామని, పిల్లల స్కూలు ఫీజులు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, నిర్వహణ ఏజెన్సీ అయిన ఎల్‌అండ్‌టి(L&T) కార్యాలయానికి తాళం వేశారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ, సీఐటీయూ నాయకులు ఈఈ వాణిశ్రీని కోరారు.

News November 7, 2025

MGBS నుంచి పంచ శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా పంచశైవక్షేత్రాల దర్శనానికి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC అధికారులు వెల్లడించారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, సామర్లకోట భీమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించేలా బస్సు సేవలు తీసుకొచ్చారు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు MGBS నుంచి బస్సు బయలుదేరుతంది. తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
SHARE IT

News November 7, 2025

ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

image

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.