News March 19, 2025
పెద్దపల్లి: నేడు 186 మంది గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. రసాయనశాస్త్రం, కామర్స్ పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 4984 విద్యార్థులకు గాను 4798 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 186 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 106 మంది, వొకేషనల్ 80మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.
Similar News
News February 25, 2026
గుంటూరు: పునర్వికకు రూ.6కోట్లు సాయం ప్రకటించిన మంత్రి లోకేశ్

కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన వ్యాధితో పోరాడుతోంది. పాప ప్రాణాలు నిలపాల్సిన ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు కాగా, దాతల సాయంతో ఇప్పటికే రూ.10 కోట్లు సమకూరాయి. మిగిలిన రూ.6 కోట్లను తాను ఏర్పాటు చేస్తానని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. చిన్నారి ప్రాణాలు నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
News February 25, 2026
శ్రీకాకుళం: రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లు అవుట్..!

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పాలనా యంత్రాంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లపై వేటు పడింది. ఒకరు బదిలీ కాగా.. మరొకరిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో నగర పాలక సంస్థ కమిషనర్గా పనిచేసిన దుర్గా ప్రసాద్ రెండు వారాల కిందట ఆకస్మికంగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ కూర్మారావు వచ్చి 2 వారాలు గడవక ముందే డయేరియా నేపథ్యంలో సస్పెన్షన్ ఎదుర్కొన్నారు.
News February 25, 2026
జగిత్యాల: రాష్ట్రస్థాయిలో మెరిసిన జిల్లా క్రీడాకారులు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 2వ ఎడిషన్ సీఎం కప్-2025లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించారు. వివిధ మండలాల నుండి పాల్గొన్న వారు కబడ్డీ, ఖో-ఖో, యోగ, బాస్కెట్బాల్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో రాణించారు. బాస్కెట్బాల్, ఖో-ఖోలో కాంస్యాలు, బాక్సింగ్, యోగ, జావెలిన్ త్రో, కిక్ బాక్సింగ్లో రజత పతకాలు దక్కాయి. కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు.


