News March 19, 2025

పెద్దపల్లి: నేడు 186 మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. రసాయనశాస్త్రం, కామర్స్ పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 4984 విద్యార్థులకు గాను 4798 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 186 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 106 మంది, వొకేషనల్ 80మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.

Similar News

News December 10, 2025

ఉప్పల్‌లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

image

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News December 10, 2025

సిరిసిల్ల జిల్లాలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 12 మండలాల్లోని 260 గ్రామపంచాయతీలకు గాను 27 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 233 సర్పంచ్ స్థానాల్లో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 860 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడతలో 5 మండలాలు, రెండో విడతలో 3 మండలాలు, తుది విడతలో 4 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

News December 10, 2025

SRCL: ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు: SP

image

ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలుంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో RDOలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం పాల్గొన్నారు.