News March 29, 2025
పెద్దపల్లి: పరువు హత్య UPDATE..

ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రేమ వ్యవహారంతో యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. A-1 ముత్యం సదయ్య (యువతి తండ్రి), A-2 ముత్యం సమత (యువతి తల్లి), A-3 సిద్ధ సారయ్య (యువతి మేనమామ) పై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు ప్రేరేపించిన ఇతరులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 23, 2025
GDK: స్టడీ సెంటర్లో డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభం

డా॥BR.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గోదావరిఖని స్టడీ సెంటర్లో డిగ్రీ విద్యార్థులకు కౌన్సెలింగ్ తరగతులు ప్రారంభమైనట్లు కో-ఆర్డినేటర్ డా॥ జీ.సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ జైకిషన్ ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. 1st Year విద్యార్థులకు 1st SEM, 2nd Year విద్యార్థులకు 3rd SEM, 3rd Year విద్యార్థులకు 6th SEM ప్రతి ఆదివారం 9AM నుంచి 5PM వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు హాజరుకావాలన్నారు
News November 23, 2025
DEC నెలాఖరుకు రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు: చంద్రబాబు

AP: డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. R&B రహదారుల అభివృద్ధిపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్లను ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 5,471KM రోడ్ల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు.
News November 23, 2025
నగరానికి CC శాపం.. బడ్జెట్కు భారం!

పెండింగ్ పనుల్లో సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్ల వాటా ఊహించని విధంగా ఉంది. ఈ కీలకమైన పనుల్లో జాప్యం వల్లే మొత్తం ఆర్థిక భారం పెరిగిపోయింది: 1,952 CC రోడ్ల పనులు పూర్తి కావాల్సి ఉంది. <<18363524>>వీటి అంచనా వ్యయం<<>> రూ.54,384.26 లక్షలు (సుమారు ₹543 కోట్లు). కేవలం 110 BT పనులకే రూ.6,419.91 లక్షలు పెండింగ్ ఉంది. మొత్తం రూ.608 కోట్ల పెండింగ్లో రూ.543 కోట్లు సీసీ రోడ్లకే కావడం గమనార్హం.


