News March 3, 2025

పెద్దపల్లి: పోలీస్ స్టేషన్‌ను పేల్చి 29 ఏళ్లు

image

PDPL జిల్లా ఓదెల(M) పొత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చిన ఘటనకు నేటితో 29ఏళ్లు. 1996 మార్చి 3న జరిగిన ఈ ఘటనతో దేశమే ఉలిక్కిపడింది. దాడిలో కానిస్టేబుల్ షేక్ దాదా మరణించగా.. అప్పటి SI శ్రీధర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని నక్సల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 2003లో అప్పటి SP RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త స్టేషన్‌‌ను నిర్మించి హోంమంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.

Similar News

News October 27, 2025

గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే అతిచిన్న స్పూన్

image

ఒడిశాకు చెందిన బిజయ్ కుమార్ రెడ్డి అనే మినియేచర్ ఆర్టిస్ట్ ప్రపంచంలోనే అతిచిన్న చెక్క స్పూన్ రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఈ స్పూన్ పొడవు 1.13mm. సూది కన్నులోంచి వెళ్లగలిగేంత చిన్నగా ఉంటుంది. దీనిని రూపొందించేందుకు 3 నెలల సమయం పట్టిందని, మైక్రోస్కోప్‌తో చూస్తేనే ఇది కనిపిస్తుందని బిజయ్ తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు బిహార్‌కు చెందిన వ్యక్తి(1.64mm) పేరిట ఉండేది.

News October 27, 2025

ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

image

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.

News October 27, 2025

అధికంగా తిని పూజలు చేయవచ్చా?

image

అధికంగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికే కాక, ఆధ్యాత్మిక పురోగతికి కూడా అడ్డంకి. మితిమీరిన ఆహారం వలన ఆయువు క్షీణించి, స్వర్గసుఖములు దూరమవుతాయి. ఇది మనస్సును అశాంతపరుస్తుంది. అంతేకాక ఇతరుల దృష్టిలో తిండిపోతుగా నిందలకు గురికావాల్సి వస్తుంది. అందుకే దేవుడిచ్చిన పవిత్ర జీవితాన్ని, దైవ చింతనలో ఉండాలనుకునేవారు అధికంగా ఆహారాన్ని స్వీకరించకూడదు. మితాహారమే భక్తి మార్గంలో మనసును స్థిరంగా ఉంచుతుంది. <<-se>>#Aaharam<<>>