News February 18, 2025

పెద్దపల్లి: పోస్ట్ కార్డు ద్వారా విద్యార్థుల ఆవేదన

image

CHO పెద్దపల్లి పట్టణంలోని ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు తమ సమస్యలను పోస్ట్ కార్డు రూపంలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, స్కూటీలు, రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పెద్దపల్లి నియోజకవర్గ BRS నాయకురాలు దాసరి ఉష తెలుసుకున్నారు. హామీలను అమలు చేయాలని విద్యార్థులు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.

Similar News

News October 16, 2025

మంత్రి సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రమ్మని మీనాక్షి కాల్

image

మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. కాసేపట్లో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటి కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖ, సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు. మంత్రి సురేఖ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్య వైరాన్ని తొలగించేందుకు మీనాక్షి నటరాజన్‌తో భేటీ కీలకం కానుంది.

News October 16, 2025

బిగ్ బాస్‌షోపై బంజారాహిల్స్ PSలో ఫిర్యాదు

image

ఓ ఛానల్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోపై బంజారాహిల్స్ PSలో కమ్మరి శ్రీనివాస్, బి.రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ, యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఫిర్యాదిదారులు అందులో పేర్కొన్నారు.

News October 16, 2025

రిజర్వేషన్లు 50% మించొద్దనడం సరికాదు: సింఘ్వీ

image

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తక్షణం జోక్యం చేసుకోవాలని TG తరఫున సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని ఉందని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. అసెంబ్లీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచామని, రిజర్వేషన్లు 50 శాతం మించరాదనడం సరికాదని వాదించారు.