News February 18, 2025
పెద్దపల్లి: పోస్ట్ కార్డు ద్వారా విద్యార్థుల ఆవేదన

CHO పెద్దపల్లి పట్టణంలోని ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు తమ సమస్యలను పోస్ట్ కార్డు రూపంలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, స్కూటీలు, రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పెద్దపల్లి నియోజకవర్గ BRS నాయకురాలు దాసరి ఉష తెలుసుకున్నారు. హామీలను అమలు చేయాలని విద్యార్థులు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.
Similar News
News November 17, 2025
వరంగల్, హనుమకొండను కలిపి ఒకే జిల్లా?

WGL, HNKను కలిపి ఒకే జిల్లాగా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు నగరాన్ని ఒకే జిల్లాగా మార్చాలంటూ పదే పదే వేదికల మీద BRSని విమర్శిస్తుండటం తెలిసిందే. ఈ మేరకు గ్రేటర్ WGLను ఒకే జిల్లాగా చేసి, మిగిలిన ప్రాంతాన్ని మరో జిల్లాగా కొనసాగించాలనే నిర్ణయంతో డ్రాఫ్టును జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
News November 17, 2025
నిడిగొండ: దీపాల కాంతుల్లో నిడిగొండ త్రికూటాలయం.!

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూటాలయం ఆదివారం సాయంత్రం జరిగిన కార్తీక దీపోత్సవంతో వెలుగులీనింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. దీపాల కాంతుల్లో త్రికూటాలయం అయోధ్య రామమందిరాన్ని పోలి ఉందనే దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
News November 17, 2025
ఆధార్ లేకున్నా స్కూళ్లలో ప్రవేశాలు!

TG: ఆధార్, బర్త్ సర్టిఫికెట్ లేకున్నా పిల్లలు బడిలో చేరొచ్చని విద్యాశాఖ తెలిపింది. గుర్తింపు పత్రాలు లేవని స్కూళ్లలో ప్రవేశాలను నిరాకరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్, ఇతర సర్టిఫికెట్లు లేవని వలస కార్మికుల పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పత్రాలేవీ లేకున్నా ప్రవేశాలు కల్పించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది. TC జారీ విషయంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.


