News February 18, 2025
పెద్దపల్లి: పోస్ట్ కార్డు ద్వారా విద్యార్థుల ఆవేదన

CHO పెద్దపల్లి పట్టణంలోని ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు తమ సమస్యలను పోస్ట్ కార్డు రూపంలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, స్కూటీలు, రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పెద్దపల్లి నియోజకవర్గ BRS నాయకురాలు దాసరి ఉష తెలుసుకున్నారు. హామీలను అమలు చేయాలని విద్యార్థులు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.
Similar News
News November 1, 2025
సంగారెడ్డి: ఉద్యోగాల కౌన్సిలింగ్కు 24 మంది హాజరు

జిల్లా వైద్య శాఖలో తొమ్మిది రకాల ఉద్యోగాల కోసం నిర్వహించిన కౌన్సిలింగ్కు 24 మంది హాజరైనట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల శనివారం తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగిందని చెప్పారు. కౌన్సిలింగ్కు ఉద్యోగులకు కేటాయించిన స్థానాలు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.
News November 1, 2025
సంగారెడ్డి: ‘ఈనెల 14 లోగా ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి’

ఇంటర్ ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. నేటి నుంచి ఈనెల 14 లోపు కళాశాలలో విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపారు. రూ.100 ఫైన్తో ఈనెల 24 వరకు, రూ.500 ఫైన్తో డిసెంబర్ 1 వరకు, రూ.2000 ఫైన్తో డిసెంబర్ 15 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News November 1, 2025
పాలమూరు: పరీక్షల టైం టేబుల్ విడుదల..!

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే B.Ed NON-CBCS (బ్యాక్లాగ్) పరీక్షల తేదీలు (టైం టేబుల్)ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 3 నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ www.palamuruuniversity.comను తనిఖీ చేయవచ్చన్నారు.


