News January 26, 2025

పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక నెరవేరింది: కలెక్టర్

image

పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాట్లను ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీవో ప్రాంగణంలోని భూమి ఆర్టీసీ కు అప్పగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లిలో పరిశ్రమ శాఖ, ప్రజా పంపిణీ వ్యవస్థ, మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Similar News

News February 17, 2025

పండ్ల మార్కెట్లో అగ్నిప్రమాదం

image

AP: రాజమండ్రి దివాన్‌చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. వ్యాపారులు వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

News February 17, 2025

ప్రార్థనా స్థలాల చట్టం కేసు: సుప్రీంకోర్టు అసంతృప్తి

image

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.

News February 17, 2025

వరంగల్: మక్కలు క్వింటా రూ.2,355

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే గత శుక్రవారం లాగే ఈరోజు కూడా మక్కలు (బిల్టీ) ధర రూ.2,355 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.7200, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

error: Content is protected !!