News August 13, 2024

పెద్దపల్లి: ప్రమాదాలకు నిలయంగా రాజీవ్ రహదారి

image

రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్ వసూలు చేస్తున్నా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. రాజీవ్ రహదారిపై బసంత్ నగర్ నుంచి మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు వరకు ఇసుక మేటలు వేయడం, సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారినా తమకేం సంబంధం లేనట్టుగా రోడ్డు నిర్వహణ సంస్థ (HKR) వ్యవహరిస్తోంది.

Similar News

News November 13, 2025

రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్‌గా కరీంనగర్

image

తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.

News November 12, 2025

హుజురాబాద్: రోడ్డు యాక్సిడెంట్ వ్యక్తి మృతి

image

హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట నుంచి హర్షిత్, త్రినేష్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వైపు వెళ్తుండగా సిరిసపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్షిత్, త్రినేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 12, 2025

కరీంనగర్: ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకు, కొడలుపై ఫిర్యాదు

image

ఆస్తి కోసం తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని ఆస్తి కాజేయాలని తన కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారని HZB ఆర్డీఓకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంటకు చెందిన గుల్లి లక్ష్మీ-మొగిలిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు చెప్పారు. పెద్ద కొడుకు, కోడలు సంపత్-స్వరూప తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకుని ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.