News March 6, 2025

పెద్దపల్లి: ప్రశాంతంగా రెండో రోజు పరీక్షలు

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ రెండవ సంవత్సరం మొదటి పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు (4900) మంది హాజరు కావాల్సి ఉండగా, (4796)మంది హాజరు కాగా,(104) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారన్నారు. 97.87% హాజరు నమోదు కావడం జరిగిందన్నారు.

Similar News

News January 3, 2026

కర్లపాలెం: ‘మృతుడి ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వండి’

image

కర్లపాలెం మండలం పేరలి గ్రామ సమీపంలో గల సముద్ర తీరం నుంచి గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిందని కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించి మృతదేహాన్ని బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు తెలుపు రంగు ఆఫ్ హాండ్స్ చొక్కా, నలుపు రంగు పాయింట్ వేసుకొని ఉన్నాడని ఆచూకీ తెలిసినవారు కర్లపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 3, 2026

కాంగ్రెస్ పార్టీతో విజయ్ పొత్తు?

image

తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన TVK పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు దిశగా అడుగులు వేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రతినిధి గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. టీవీకే, కాంగ్రెస్ లౌకికవాదానికి కట్టుబడి ఉన్న సహజ భాగస్వాములని ఆయన అన్నారు. ‘‘భవిష్యత్‌లో ఇరు పార్టీలు కలిసి పనిచేయొచ్చు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దీనికి అడ్డు పడుతుండొచ్చు’’ అని గెరాల్డ్ పేర్కొన్నారు.

News January 3, 2026

పోలవరం: జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు

image

పోలవరం జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వై.రామవరం మండలంలోని డొంకరాయి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ చరణ్ నాయక్ వాహన తనిఖీలు నిర్వహించారు. రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ శివ కుమార్, జడ్డంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ చినబాబు వాహన తనిఖీలు చేసి రికార్డులు సక్రమంగా లేనివారికి జరిమానాలు విధించారు.