News April 2, 2025

పెద్దపల్లి: భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

image

ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు ఆర్టీసీ చేసింది. ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.151, ఆన్‌లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, బుకింగ్ కోసం KNR 91542 98581, 9154298561, GDK 91542 98554, HSB 9154298673, HZB 9154298559, మంథని 9154298554, JGL 7780250439, KRTL 9154298572, MTPL 9154298574, SRCL 9154298576, VMD 9154298574 నంబర్లలో సంప్రదించవచ్చు.

Similar News

News November 16, 2025

నాగారం: కారు ఢీ.. కానిస్టేబుల్ దుర్మరణం

image

నాగారం మండలంలో అతివేగంతో వచ్చిన<<18299567>> కారు ఢీకొనడంతో<<>> కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం… పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి ముగ్గురిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ కమలాకర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడ్డ మరో ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News November 16, 2025

సఖినేటిపల్లి: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేపలు

image

సఖినేటిపల్లి (M) అంతర్వేది తీరంలో మత్స్యకారుల వలలకు శనివారం అరుదైన చేపలు చిక్కాయి. అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన వేలంలో వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. ప్రధానంగా 13 గోల్డ్ ఫిష్ (కచ్చిడి) చేపలు ఏకంగా రూ.52 వేలు పలకడం విశేషం. ఇక మార్కెట్లో కోనాం కిలో రూ.600, కవర్లు రూ.70, బోంబేడెక్ రూ.65 చొప్పున ధర పలికాయి. మంచి ధర దక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

News November 16, 2025

జనగామ: యాక్సిడెంట్.. మార్చురీలో మృతదేహాలు

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో HNK-HYD జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18300916>>ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే<<>>. హన్మకొండ జిల్లా బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన పూలమాటి ఓం ప్రకాశ్ మృతి చెందారు. వీరి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రిలో ఉంచారు.