News April 2, 2025
పెద్దపల్లి: భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు ఆర్టీసీ చేసింది. ఒక్కొక్క ప్యాకెట్కు రూ.151, ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, బుకింగ్ కోసం KNR 91542 98581, 9154298561, GDK 91542 98554, HSB 9154298673, HZB 9154298559, మంథని 9154298554, JGL 7780250439, KRTL 9154298572, MTPL 9154298574, SRCL 9154298576, VMD 9154298574 నంబర్లలో సంప్రదించవచ్చు.
Similar News
News July 6, 2025
పెద్దపల్లి: జిల్లా అధ్యక్షుడిగా ఏటూరి శ్రావణ్ కుమార్

తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏటూరి శ్రావణ్ కుమార్ ఆచార్యులు నియామకం అయ్యారు. పెద్దపల్లిలోని హనుమాన్ దేవాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరంబుదూరు శ్రీకాంత్ ఆచార్యులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నిట్టూరి సతీష్ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాండూరి దామోదరచార్యులు ఆయనకు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ ఆచార్యులును పలువురు అభినందించారు.
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.
News July 6, 2025
కామారెడ్డి: పీర్లను సందర్శించిన షబ్బీర్ అలీ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మొహరంలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో పీర్ల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. మొహరం అన్ని వర్గాల వారు జరుపుకోవడం అభినందనీయమన్నారు.