News February 17, 2025

పెద్దపల్లి: ‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ 

image

పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని సీపీ అన్నారు. అందుబాటులో ఉన్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులను పరిశీలించిన సీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Similar News

News September 13, 2025

ఇక విరిగిన ఎముకలు 3 నిమిషాల్లో ఫిక్స్!

image

విరిగిన ఎముకలను నయం చేసేందుకు చైనీస్ రీసెర్చర్స్ కొత్త పద్ధతిని కనుగొన్నారు. 3 నిమిషాల్లోనే అతుక్కునేలా చేసే ‘బోన్ 02’ అనే జిగురును జేజియాంగ్ ప్రావిన్స్‌లోని సర్ రన్ రన్ షా ఆస్పత్రి చీఫ్ సర్జన్ లిన్ బృందం ఆవిష్కరించింది. నీటిలో బ్రిడ్జిలకు ఆల్చిప్పలు బలంగా అతుక్కోవడాన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేశామంది. 150 మంది పేషెంట్లపై టెస్ట్ చేయగా సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది.

News September 13, 2025

ఈ నెల 14 వరకు ఏపీ లాసెట్-25కు దరఖాస్తులు

image

ఏపీ లాసెట్-25 ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 11నుంచి 14 వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీతాకుమారి పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 17లోపు వెబ్ ఆప్షన్ల నమోదు, 18లోపు వెబ్ ఆప్షన్లలో మార్పు చేసుకోవచ్చు. 20న సీట్ అలాట్మెంట్, 22న తరగతులను ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.

News September 13, 2025

ములుగు: లోక్ అదాలత్‌లో 1,409 కేసులు పరిష్కారం

image

ములుగు జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. నాలుగు బెంచ్‌లు ఏర్పాటు చేయగా 1,409 కేసులను పరిష్కరించారు. పెండింగ్ కేసులలో రాజీ కుదుర్చుకోవడంతో ప్రశాంత జీవనం సాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ అన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ పడ్డ కేసులకు పైకోర్టులలో అప్పీల్ ఉండదని, ఇదే అంతిమ తీర్పు అని తెలిపారు. కక్షిదారులకు పులిహోర పంపిణీ చేశారు.