News February 17, 2025

పెద్దపల్లి: ‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ 

image

పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని సీపీ అన్నారు. అందుబాటులో ఉన్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులను పరిశీలించిన సీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Similar News

News March 24, 2025

మిస్‌ తెలుగు USA ఫైనలిస్ట్‌లో ఖమ్మం జిల్లా యువతి

image

మిస్‌ తెలుగు USA – 2025 పోటీల్లో బోనకల్‌ మం. ముష్టికుంట్లకు చెందిన యువతి గీతిక ఫైనల్స్‌కు చేరింది. అమెరికాలో స్థిరపడి చదువుకుంటున్న తెలుగు వారి కోసం ఈ పోటీలు నిర్వహిస్తారు. తెలుగుభాష గొప్పతనం, ఆత్మగౌరవం, సంస్కృతి తదితర అంశాలతో విజేతను ఎంపిక చేస్తారు. ఫినాలే మే25న డల్లాస్‌లో జరగనుండగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముష్టికుంట్లకు చెందిన శివనర్సింహారావు-మాధవి దంపతుల కుమార్తె గీతిక.

News March 24, 2025

నరసరావుపేట: సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు 

image

వివిధ రకాల కార్పొరేషన్‌ కింద స్వయం ఉపాధి రుణాల దరఖాస్తు గడువు పెంచినట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. 2024-25 సంవత్సరంలో బీసీ, కాపు, ఈ బీసీ, తదితర అన్ని కార్పొరేషన్‌కి సంబంధించిన సబ్సిడీ రుణం మంజూరు కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. B.C, E.W.Sలో ఉన్న ఏడు కార్పొరేషన్‌ల లబ్ధిదారుల కోసం స్వయం ఉపాధి పథకాల నమోదు ప్రక్రియ ఈనెల 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 

News March 24, 2025

జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!