News April 2, 2025

పెద్దపల్లి: ముగిసిన పది పరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

Similar News

News November 21, 2025

HYD: ఆర్టీసీ కార్మికులపై దాడిచేస్తే కఠిన చర్యలు: నాగిరెడ్డి

image

ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. విధినిర్వహణలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడులకు పాల్పడటం సహించరాని నేరమని అన్నారు. వారిపై దాడులు చేస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సంస్థ పరంగా కార్మికులకు పూర్తి భద్రత, భరోసా ఉంటుందని నాగిరెడ్డి హామీ ఇచ్చారు.

News November 21, 2025

బిహార్ ఎన్నికలపై ఆరోపణలు.. ECI వివరణ ఇవ్వాలని డిమాండ్!

image

బిహార్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లెక్కలు సరిపోలడం లేదని పొలిటికల్ ఎకనామిస్ట్ పి.ప్రభాకర్ ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో 1,77,673 ఓట్లు ఎక్కువగా వచ్చాయని Xలో <>పోస్టులు<<>> పెట్టారు. ఫైనల్ SIR ఫిగర్‌ను ప్రకటించిన తర్వాత కూడా మొత్తం ఓటర్ల సంఖ్యను EC 2సార్లు మార్చిందని, ఓటింగ్ శాతంపై విడుదల చేసిన ప్రకటనల్లోనూ తేడాలున్నాయన్నారు. దీనిపై ECI వివరణ ఇవ్వాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

News November 21, 2025

జర్నలిస్ట్‌లు అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి : DIPRO

image

2026 – 2027 సంవత్సరానికి గాను అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు DIPRO, I&PR కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. https://mediarelations.ap.gov.in/media/#/home/index లింకు ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిపోర్టర్ తమ పేరు, హోదా, మెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా పంపించాలన్నారు.