News February 14, 2025

పెద్దపల్లి: ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

image

ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని, వారికి ఇచ్చిన మాట ప్రకారం భూమి కేటాయించామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం పెద్దపల్లి పట్టణంలో ఫారన్ మసీదులో ముస్లింలు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాఘవపూర్ గ్రామ శివారులో ఇచ్చిన మాట ప్రకారం కబ్రస్థాన్ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు. 

Similar News

News November 23, 2025

అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR

image

AP: తనకు వేరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(VSR) అన్నారు. ప్రస్తుతానికి తాను రైతు మాత్రమేనని చెప్పారు. ఇతర పార్టీల్లోనూ చేరే ఉద్దేశమూ లేదని పేర్కొన్నారు. అవసరం వస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందన్నారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిబద్ధత లేని వారి మాటలు జగన్ వినకూడదని సూచించారు.

News November 23, 2025

భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

image

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News November 23, 2025

సంగారెడ్డి: ‘మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం’

image

సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా గ్రూపు మహిళలకు రూ. 590 కోట్ల రుణాలను అందించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రూ. 32 కోట్ల వడ్డీ రాయితీ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే సీఎం రేవంత్ రెడ్డి లక్షమని పేర్కొన్నారు.