News April 14, 2025

పెద్దపల్లి: యువ వికాసం పథకానికి 34 వేల దరఖాస్తులు

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్దపల్లి జిల్లాలో 34 వేల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయంతో పాటు శిక్షణ కల్పించేందుకు రూపొందించిన ఈ పథకంపై యువతలో భారీ స్పందన కనిపిస్తోంది. ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 27, 2025

చిత్తూరు: మహిళా ఉద్యోగులకు తప్పని వేధింపులు.!

image

చిత్తూరులో జిల్లాలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై విలేకరుల మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. వనదుర్గాపురానికి చెందిన ఆర్మీ ఉద్యోగి నవీన్ నాయుడు, విలేకరి శరవణ, HRC సభ్యుడు గురు ప్రసాద్‌ సోషల్ మీడియా వేదికగా తనను చిత్రవధ చేస్తున్నారని ఓ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. 5 నెలలుగా వేధిస్తుండగా భర్త అనుమానంతో దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 27, 2025

ADB: సం’గ్రామం’ షురూ.. మొదలైన ఎన్నికల సందడి

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకముందే పల్లెల్లో సందడి మొదలైంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పోరు మరింత జోరందుకుంది. బీసీలకు కొంతమేర స్థానాలు తగ్గినప్పటికీ.. కొన్ని జనరల్ కేటగిరీ రావడంతో ఏదేమైనా పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కులాల వారీగా అంచనాలు వేసుకుని ఏం చేస్తే బాగుంటుందని సమాలోచనలు చేస్తున్నారు. ఉమ్మడి ADBలో 1,514 పంచాయతీల్లో ఈసారి పోరు రసవత్తరంగా ఉండనుంది.

News November 27, 2025

ఆ రహదారిపై ప్రమాదాలు ఎక్కువ: బాపట్ల ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల వలన సంభవించే మరణాల వలన ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఎస్పీ ఉమామహేశ్వర్ బుధవారం తెలిపారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్టీవో, ఆర్అండ్‌బీ, హైవే అధికారులు సంయుక్త కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిధిలో ప్రధానంగా నామ్ హైవే, హైవే నంబర్ 16, 216లపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.