News April 20, 2025
పెద్దపల్లి: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందున ఈ సోమవారం ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లా ప్రజలు కలెక్టరేట్కు రావద్దని సూచించారు.
Similar News
News April 21, 2025
కాల్పుల విరమణలోనూ రష్యా దాడులు: జెలెన్స్కీ

ఈస్టర్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన <<16153897>>కాల్పుల విరమణ<<>> బూటకమని ఉక్రెయిన్ జెలెన్స్కీ మండిపడ్డారు. తమ భూభాగంలో ఆదివారం 50కి పైగా బాంబులు, డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. వైమానిక దాడులు జరగకపోవడం ఊరట కలిగించే అంశమని చెప్పారు. క్షేత్రస్థాయిలో పుతిన్ సైన్యంపై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు. ఆ దేశానికి యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు.
News April 21, 2025
కడప: ఇవాళ ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా

కడప నగర పరిధిలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో 21 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 21, 2025
పెబ్బేరు: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధుడి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన పెబ్బేరులో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ యుగంధర్ రెడ్డి వివరాలు.. పెబ్బేరుకు చెందిన బుచ్చన్న(65) శనివారం గొర్రెలకు గడ్డి తీసుకోస్తానని చెప్పి గ్రామ శివారులోని బావిలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. మృతుడి కుమారుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.