News March 22, 2025

పెద్దపల్లి: రేపట్నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రత్యేక డ్రైవ్

image

మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ డి.వేణు, ఆర్డీవోలు, సంబంధిత తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూముల సంరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Similar News

News November 22, 2025

ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు ఇస్తాం: మంత్రి తుమ్మల

image

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లోపు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ప్రతి మహిళకు వద్దకు వెళ్లి, బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరలను అందించాలని సూచించారు.

News November 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 74

image

ఈరోజు ప్రశ్న: వేంకటేశ్వరస్వామి ద్వార పలుకులు అయిన జయవిజయులు తర్వాతి మూడు జన్మలలో అసురులుగా ఎందుకు జన్మించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 22, 2025

శ్రీకాకుళం నుంచి ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైలు

image

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) నుంచి ప్రశాంతి నిలయయానికి ప్రత్యేక రైలును శుక్రవారం శ్రీ సత్యసాయి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు ప్రారంభించారు. ప్రత్యేక ట్రైన్‌లో సుమారు 1,400 భక్తులతో ప్రయాణమైందని ఆయన తెలిపారు. ఈనెల 23వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వందల పుట్టినరోజు సందర్భంగా ఈ రైలును ఏర్పాటు చేశామన్నారు.