News March 22, 2025
పెద్దపల్లి: రేపట్నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రత్యేక డ్రైవ్

మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ డి.వేణు, ఆర్డీవోలు, సంబంధిత తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూముల సంరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
Similar News
News February 25, 2026
నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దోర్నాల(M) గంటవానిపల్లి వద్ద రూ.456 కోట్లతో చేపడుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తర్లుపాడులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత సీఎం అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.
News February 25, 2026
కృష్ణా: మంత్రి లోకేశ్కు అభినందనలు తెలిపిన ఏపీ హైకోర్టు

కేజీబీవీల టీచర్ల జీతాలు పెంచుతామని, ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలను AP హైకోర్టు ప్రశంసించింది. సమస్యలపై స్పందించిన మంత్రి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని కోర్టు తెలిపింది. హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై స్పందించిన తీరును అభినందించింది. అయితే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
News February 25, 2026
GNT: మంత్రి లోకేశ్కు అభినందనలు తెలిపిన ఏపీ హైకోర్టు

కేజీబీవీల టీచర్ల జీతాలు పెంచుతామని, ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలను AP హైకోర్టు ప్రశంసించింది. సమస్యలపై స్పందించిన మంత్రి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని కోర్టు తెలిపింది. హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై స్పందించిన తీరును అభినందించింది. అయితే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.


