News February 23, 2025

పెద్దపల్లి: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

పెద్దపల్లి కలెక్టరేట్లో ఫిబ్రవరి 24న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 26, 2025

జనగామ: విధుల్లో చేరిన డీఐఈఓ జితేందర్ రెడ్డి

image

తన వ్యక్తిగత పనుల నిమిత్తం వారం రోజుల పాటు సెలవుపై వెళ్లిన జనగామ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె.జితేందర్ రెడ్డి విధుల్లో చేరారు. ఆయన సెలవుల్లో ఉన్నప్పుడు ఇన్‌ఛార్జి డీఐఈవోగా ఎస్.శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరిగిన సిలబస్ పై ఆరా తీస్తున్నారు. త్వరగా పూర్తి చేసి రివిజన్ చేయాలని ఆదేశించారు.

News October 26, 2025

ఆచంట: ఆస్తుల పంపకాల్లో గొడవ.. గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆచంట మండలం పెదమల్లంలో చోటుచేసుకుంది. ఆచంట పోలీసుల వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన బొలిశెట్టి నరసింహారాజు తన తాలూకా కుటుంబ ఆస్తులు పంపకాలు చేయడం లేదని మనస్థాపానికి గురయ్యారు. దీంతో నిన్న సాయంత్రం సరిహద్దులో ఉన్న పెద్దమల్లంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 26, 2025

శ్రీ చైతన్యలో స్కాలర్‌షిప్‌ టెస్ట్.. లాప్‌టాప్‌ బహుమతి

image

పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో కార్పొరేట్ విద్య అందించేందుకు శ్రీ చైతన్య ఐఐటీ-జేఈఈ & నీట్ అకాడమీ స్కాలర్‌షిప్ టెస్ట్‌ను నవంబర్ 2న నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. మొదటి బహుమతిగా లాప్‌టాప్, 2 నుంచి 10వ ర్యాంకు వారికి ట్యాబ్‌లు ఇస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 98485 87584 నంబర్‌ను సంప్రదించాలని అకాడమీ డైరెక్టర్‌ రవికిరణ్ తెలిపారు.