News February 24, 2025
పెద్దపల్లి: రేపు ప్రభుత్వ హాస్పటల్లో డాక్టర్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ఫిబ్రవరి 25న గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 2 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (గైనకాలజిస్ట్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు 8499061999ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 25, 2025
మోదీ చెప్పిన ఫూల్ మఖానా లాభాలివే..

ఏడాదిలో 300రోజులు ఫూల్ మఖానా తింటానని PM మోదీ <<15567735>>చెప్పారు<<>>. మరి ఆ సూపర్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలేంటో చూద్దామా?
* క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేసి, టైప్-2 డయాబెటిస్కు అడ్డుకట్ట వేస్తాయి.
* ఫైబర్ ఆకలిని తగ్గించి, బరువు పెరగకుండా చేస్తుంది.
* అమినో యాసిడ్స్ చర్మంపై మడతలు, మొటిమల్ని తగ్గిస్తాయి.
News February 25, 2025
NZB: మద్యం ప్రియులకు షాక్..

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ నిర్వహించాలని ఎక్సైజ్ సీఐ దిలీప్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను మద్యం వ్యాపారులు తప్పనిసరిగా అమలు పరచాలని సూచించారు.
News February 25, 2025
భద్రాచలం: MURDER అటెంప్ట్.. జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో నిందితుడికి భద్రాచలం కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. పట్టణంలోని ఎస్ఆర్ఎన్ కాలనీకి చెందిన వినోద్, దుమ్ముగూడెంకు చెందిన జెట్టి చరణ్ పై ఫిర్యాదు చేయగా భద్రాచలం టౌన్ ఎస్ఐ మధుప్రసాద్ కేసు నమోదు చేసి, కోర్టులో ఛార్జిషీట్ వేసి విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన న్యాయమూర్తి శివనాయక్ సోమవారం తీర్పును వెల్లడించారు.