News February 10, 2025

పెద్దపల్లి: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

పెద్దపల్లి జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమయతమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అధికారులు ఆ దశగా అడుగులు వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 2019 ఎన్నికల ప్రకారం జడ్పీటీసీలు 13, ఎంపీటీసీ 137 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలను కలుపుకుంటే కొంత తగ్గే అవకాశం ఉంది. అటు ఎన్నికల కమిషన్ ఆదేశాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News December 1, 2025

వనపర్తి: మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా అప్పగించాలి

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి.ఎం.ఆర్.)ను ఎప్పటికప్పుడు వేగంగా పూర్తి చేసి ప్రభుత్వానికి డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం మదనాపురం మండల పరిధిలోని భాను ట్రేడర్స్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలను అదనపు కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.

News December 1, 2025

మక్తల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర నిర్ణయాలు: మంత్రి

image

మక్తల్ ప్రాంత అభివృద్ధి దశాబ్దాలుగా మాటల్లోనే మిగిలిపోయిందని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. కృష్ణా నది పక్కన ఉన్నా వ్యవసాయానికి నీరు లేక ప్రజలు వలసబాట పట్టే పరిస్థితి ఎదురయ్యేదని గుర్తుచేశారు. అయితే సీఎంరేవంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 5 వేల కోట్లతో, లక్ష ఎకరాలకు నీరు చేరేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి “అపర భగీరథుడు” అన్నారు. ముఖ్యమంత్రికి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

News December 1, 2025

MNCL: బహిరంగంగా మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు

image

మంచిర్యాల జోన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ఆగడాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 1 నుంచి జనవరి 1 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.