News January 24, 2025
పెద్దపల్లి: ‘రైతులకు విజ్ఞప్తి ‘

పెద్దపల్లి జిల్లాలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా యాసంగి పెట్టుబడి సాయం అందించనుంది. ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో ఆయా గ్రామాల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 1లోపు పట్టాదారుగా నమోదైన రైతులు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, PPBతో ఆయా గ్రామాల రైతు వేదికల్లో AEOలకు దరఖాస్తులు అందజేయాలి. రైతు బంధు పొందిన వారు, గ్రామసభల్లో దరఖాస్తు చేసినవారు మళ్లీ సమర్పించాల్సి పనిలేదన్నారు.
Similar News
News November 18, 2025
కామారెడ్డి: ‘డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలి’

డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సోమవారం వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25మంది రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులతో ఎమ్మెల్యే పాల్గొని, యువత ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించడంపై పరిశోధన చేయనున్నట్టు విద్యార్థులు చెప్పారు.
News November 18, 2025
కామారెడ్డి: ‘డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలి’

డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సోమవారం వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25మంది రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులతో ఎమ్మెల్యే పాల్గొని, యువత ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించడంపై పరిశోధన చేయనున్నట్టు విద్యార్థులు చెప్పారు.
News November 18, 2025
వరంగల్: అర్ధరాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లో పోలీస్ తనిఖీలు

నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్పర్జన్ రాజ్ సిబ్బందితో కలిసి వరంగల్, హన్మకొండ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు, వారి బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.


