News February 12, 2025
పెద్దపల్లి: వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించేందుకు ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని పుట్ట మధు తరఫు న్యాయవాది కేసు కొట్టివేయాలని కోర్టును కోరారు. కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది.
Similar News
News December 7, 2025
WGL: పంచాయతీల్లో డీసీసీ జాడ లేదు!

పేరుకే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మారిపోయారు. గత వారం రోజుల కిందట ప్రకటించిన డీసీసీ కమిటీలతో పెద్దగా లాభం లేకుండా పోయింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడి ప్రమేయం ఏ మాత్రం లేదు. కేవలం ఆయా నియోజకవర్గ MLAల నిర్ణయమే ఫైనల్. కేవలం సభలు జరిగితే, ఎమ్మెల్యే పక్కన సీటు మాత్రమే డీసీసీ చీఫ్లకు ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఉత్సవ విగ్రహాలుగానే డీసీసీ ప్రెసిడెంట్లు మిగిలిపోయారు.
News December 7, 2025
ఘనంగా కృష్ణా తరంగ్.. ఆటపాటలతో సందడి చేసిన యువత

కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్-2025 వేడుకలు ఘనంగా ముగిసాయి. కృష్ణా తరంగ్ పేరుతో మూడు రోజులపాటు నిర్వహించిన యూత్ ఫెస్టివల్లో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. విశ్వవిద్యాలయం పరిథిలోని అనుబంధ కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని పలు అంశాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. విజేతలకు శనివారం సాయంత్రం జరిగిన ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేశారు.
News December 7, 2025
ఘనంగా కృష్ణా తరంగ్.. ఆటపాటలతో సందడి చేసిన యువత

కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్-2025 వేడుకలు ఘనంగా ముగిసాయి. కృష్ణా తరంగ్ పేరుతో మూడు రోజులపాటు నిర్వహించిన యూత్ ఫెస్టివల్లో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. విశ్వవిద్యాలయం పరిథిలోని అనుబంధ కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని పలు అంశాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. విజేతలకు శనివారం సాయంత్రం జరిగిన ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేశారు.


