News April 5, 2025
పెద్దపల్లి వాసులూ.. అప్లై చేశారా..?

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్స్తో ఆన్లైన్లో అప్లై చేసి హార్డ్ కాపీలను పెద్దపల్లి జిల్లాలోని MPDO ఆఫీస్లో ఇవ్వాలి. SHARE
Similar News
News November 26, 2025
వనపర్తి: TCC పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని బుధవారం తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్,ఎంబ్రాయిడరీలో లోయర్, హాయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజును ఈనెల 5 వరకు చెల్లించాలని అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 12 వరకు అలాగే రూ.75 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News November 26, 2025
సంగారెడ్డి: ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఇన్స్ట్రక్టర్లు

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో బోధించడానికి ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 59 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 వేతనం చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 26, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు దక్కని ప్రాధాన్యం

ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు తక్కువ ప్రాధాన్యత దక్కింది. ఖమ్మం జిల్లాలో కేవలం 24 బీసీ (మహిళ) స్థానాలు దక్కగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 226 ఎస్టీ (మహిళ), 4 జనరల్ స్థానాలు కేటాయించారు. ఒకే మండలంలో ఇల్లెందులో 29 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ కావడంతో బీసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


