News April 5, 2025

పెద్దపల్లి వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను పెద్దపల్లి జిల్లాలోని MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News April 18, 2025

వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా యుద్ధ బాధితుడి చిత్రం

image

గాజా‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో గాయపడిన ఓ బాలుడి చిత్రం ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. పాలస్తీనాకు చెందిన ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలూఫ్ ఈ ఫొటో తీశారు. ఈ చిత్రంలోని బాలుడు రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో కనిపిస్తున్నాడు. ఈ యుద్ధం వల్ల భవిష్యత్తు తరాలు ఎలా అంధకారంలోకి వెళ్లాయో ఈ చిత్రం చెబుతుందని వరల్డ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.

News April 18, 2025

సంగారెడ్డి: భర్త ఆత్మహత్య

image

భార్యలు తన దగ్గర లేరని భర్త గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. అస్సాంకు చెందిన బిశాల్(30) కొల్లూరులో కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో బిశాల్ తరుచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నందిగామకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారు తరుచూ గొడవపడటంతో ఆమె కూడా వెళ్లింది. మనస్థాపం చెందిన బిశాల్ కారు వాష్ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.

News April 18, 2025

కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నిరూపించే సమయమిది: కేటీఆర్

image

TG: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని మోదీ కేవలం మాటలకే పరిమితం కావొద్దని KTR కోరారు. అందులో జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక కుంభకోణం జరిగిందని చెప్పారు. భూముల తాకట్టు వ్యవహారాన్ని CBI, SEBI, RBI దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. TGలో కాంగ్రెస్, BJP ఒకటి కాదని నిరూపించే సమయమిదని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!