News February 1, 2025
పెద్దపల్లి: విద్యా కమిషన్ ప్రజా అభిప్రాయ సేకరణ: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరి 4న తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రాష్ట్ర నూతన విద్య పాలసీ రూపకల్పన పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రాష్ట్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం విద్యా కమిషన్కు బాధ్యతలు అప్పగించిందని, అభిప్రాయాలను విద్యా కమిషన్కు తెలియజేయాలని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
నూతన సంవత్సర వేడుకలు చట్టబద్ధంగానే జరుపుకోవాలి: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. డీజేలు, బాణాసంచా నిషేధమని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుతంగా, కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.
News December 30, 2025
ములుగు జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్-1 డీఐజీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడ్వాయి ఎస్సైగా జగదీశ్ విధుల్లో చేరగా, తాడ్వాయిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ములుగు డీఆర్సీబీ ఎస్సైగా బదిలీ అయ్యారు. పస్రా ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కమలాకర్ నార్లాపూర్, మేడారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. భూపాలపల్లిలో ఉన్న ఎస్సై తాజుద్దీన్ పస్రా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.
News December 30, 2025
మహాశివరాత్రి భక్తుల కోసం ఐదు వైద్య బృందాలు : DM&HO రజిత …..

మహా శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ఐదు వైద్య బృందాలు ఏర్పాటు చేస్తామని DM&HO డా.రజిత తెలిపారు. 30 మంది డాక్టర్లు, 132 మంది పారామెడికల్ సిబ్బంది, 5 అంబులెన్సులను మూడు రోజుల పాటు రేయింబవళ్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రజలకు కనిపించే విధంగా క్యాంపులు ఏర్పాటు చేయాలని, అస్వస్థతకు గురయ్యే భక్తులకు క్షణాల్లో వైద్యం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు.


